వెండితెర సత్యభామగా పేరు సంపాదించుకున్న జమున వయసు పై పడటంతో అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు.ఈ విధంగా మరణించడంతో సినీ సెలబ్రిటీలు మొత్తం ఈమెకు నివాళులు అర్పించారు.
ఇకపోతే జమున మరణించడంతో ఈమె వ్యక్తిత్వం గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి.అయితే జమున గురించి అప్పట్లో కొందరు దర్శక నిర్మాతలు తనకు చాలా పొగరు అని కనీసం ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు అని చెప్పేవారు.
ఈ విధంగా జమున గురించి దర్శక నిర్మాతలు ఇలా మాట్లాడటానికి ఓ కారణముంది.ఈమె ఇండస్ట్రీలో నటిగా ఎంతో ఎదిగిన తర్వాత తన కుటుంబం మొత్తం మద్రాస్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.అయితే కొందరు వ్యక్తులు కారులో జమున ఇంటికి వచ్చి తన తండ్రి గారిని ఓ సినిమా గురించి మాట్లాడాలని చెప్పి తనని కారులో తీసుకువెళ్లారట.అయితే ఇదివరకు ఆ వ్యక్తులు తన తండ్రికి పరిచయం లేరు అయితే వారిప్రవర్తన పై అనుమానం వచ్చిన జమున తండ్రి ఏమాత్రం కంగారు పడకుండా సిగరెట్ కోసం కారు ఆపమని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడ్డారట.
ఇలా జమున తండ్రి అప్పటినుంచి తన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరుగుతుందేమోనని భావించి ఎవరు వచ్చినా కూడా తలుపు తెరవద్దని ఒకవేళ వారితో మాట్లాడాలి అనుకుంటే కిటికీలో నుంచి మాట్లాడమని చెప్పేవారట.ఇక గుర్తు తెలియని వాళ్ళు వస్తే మాత్రం తాను ఉన్నప్పుడే రమ్మని చెప్పేవారట.ఇలా జమున తండ్రి చెప్పడంతో ఆమె ఎవరు వచ్చినా కూడా ఇంట్లోకి రానిచ్చేవారు కాదని, ఇలా జమున తలుపులు తీయకపోవటం వల్ల ఎంతో మంది దర్శక నిర్మాతలు తన గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్లే వారట అయితే ఈ విషయం తెలియనటువంటి దర్శక నిర్మాతలు జమునకు చాలా పొగరు అనుకునేవారట.