అరణ్య నన్ను పూర్తిగా మార్చేసిందంటున్న రానా.. ఏ విషయంలో అంటే?

తెలుగు సినీ నటుడు రానా గురించి అందరికీ తెలిసిందే.

లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన రానా తమిళం, హిందీలో కూడా నటించి తన నటనలో మంచి గుర్తింపు పొందాడు.

అంతేకాకుండా బాహుబలి సినిమా తర్వాత రానా క్రేజ్ మరింత విపరీతంగా పెరిగింది.ఇదిలా ఉంటే మిహీకా బజాజ్ తో గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రానా వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో రానా నటిస్తున్నాడు.

అంతేకాకుండా వేణు దర్శకత్వంలో విరాటపర్వంలో కూడా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం నటించిన మరో సినిమా అరణ్య.

Advertisement

ఈ సినిమాకు ప్రభు దర్శకత్వ‌ం వహించాడు.ఇక ఈ సినిమా అడవి నేపథ్యంలో తెరకెక్కనుంది.

తాజాగా ఈ సినిమా ఏనుగుల ప్రాధాన్యంతో ట్రైలర్ ను విడుదల చేయగా.ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

ఇదిలా ఉంటే ట్రైలర్ విడుదల సందర్భంగా రానా కొన్ని విషయాలు పంచుకున్నారు.అరణ్య సినిమా తనను మనిషి గా మార్చిదంట‌ూ, ఏనుగులు తనకెంతో నేర్పించాయని తెలిపాడు.ఈ సినిమాలో తన పేరు అరణ్య అని చెబుతూ ఈ సినిమా కోసం తాము మూడు సంవత్సరాలు షూటింగ్ లో పాల్గొన్నామని తెలిపారు.

ఇందులో అరణ్య పాత్ర అడివిని కాపాడుతుంటాడని, తన పాత్ర జాదవ్ పయేంగ్ ఆధారంగా పుట్టిందని తెలిపాడు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఏనుగులు ఎంతో నేర్పించాయని, మనం భూమిని కాపాడుకుంటే, భూమి మనల్ని కాపాడుతుంది అని చెప్పుకొచ్చాడు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఇక ప్రతి సినిమా నుంచి తాము ఏదో ఒకటి నేర్చుకుంటామంటూ, కానీ ఈ సినిమా తనను మనిషి గా మార్చిదంటూ తెలిపాడు.ఇక మనుషులు, జంతువులు ప్రకృతిలో భాగమని మనమందరం కలిసి ఉండాలని.

Advertisement

అలా కాదని ప్రకృతికి కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో మనందరం చూశామని తెలిపాడు.

తాజా వార్తలు