BJP Manifesto Committee : లోక్‎సభ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ నియామకం

లోక్‎సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ మ్యానిఫెస్టో కమిటీని( BJP Manifesto Committee ) నియమించింది.

ఈ మేరకు బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా( JP Nadda ) 27 మందితో పార్టీ మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు.

బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడుగా రాజ్ నాథ్ సింగ్ ను( Rajnath Singh ) జేపీ నడ్డా నియమించారు.

కన్వీనర్ గా నిర్మిలా సీతారామన్,( Nirmala Sitaraman ) కో -కన్వీనర్ గా పీయూష్ గోయల్,( Piyush Goyal ) కమిటీ సభ్యులుగా పలువురు కేంద్రమంత్రులు, మాజీ సీఎం, సీనియర్ నేతలు ఉండనున్నారు.కాగా బీజేపీ మ్యానిఫెస్టో కమిటీలో 16 రాష్ట్రాల నేతలకు స్థానం కల్పించారు.అయితే తెలుగు రాష్ట్రాల నుంచి నేతలకు కమిటీలో చోటు దక్కలేదు.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు