ముంబై ఆస్పత్రిలో ఏపీ మంత్రి పినిపేకు ఆపరేషన్..!

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయనకు గుండెకి సంబంధించిన ఆపరేషన్ ను వైద్యులు నిర్వహిస్తున్నారు.

ఈనెల 2న వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముందుగా రాజమండ్రిలో తర్వాత హైదరాబాదులో వైద్యం చేయించుకున్నారు.

కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో పినిపే ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయన గుండెకు ఆపరేషన్ అవసరమని సూచించారు.

కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వరూప్ కు వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Advertisement
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి..!!

తాజా వార్తలు