మందుబాబుల‌కు ఏపీ ప్ర‌భుత్వం భారీ షాక్.. ఇక అలా అస‌లు కుద‌ర‌దు

మందుబాబుల‌కు ఏపీ ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది.ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెచ్చుకోవ‌డంపై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెచ్చుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించింది.ఏపీలో మ‌ద్యం ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండటం, అవ‌స‌ర‌మైన బ్రాండ్లు దొర‌క్క‌పోవ‌డంతో మందుబాబులు ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెచ్చుకుంటున్నారు.

మ‌రికొంత‌మంది ఇత‌రుల‌తో మ‌ద్యం తెప్పించుకుంటున్నారు.ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వులు మందుబాబుల‌కు షాకిచ్చేలా ఉన్నాయి.

ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు మ‌ద్యం బాటిళ్లు తెచ్చుకోవ‌చ్చంటూ ఇటీవ‌ల ఏపీ హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది.దీంతో మందుబాబులు తెగ ఆనంద ప‌డ్డారు.

Advertisement

ఆ ఆనందం కొద్దిరోజులు కూడా ఉండ‌లేదు.అంతోలోనే మూడు మ‌ద్యం బాటిళ్లు కూడా ఇత‌ర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవ‌డంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ఇవాళ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో మందుబాబులు షాక్‌లో ఉన్నారు.

అస‌లే అధిక ధ‌ర‌ల‌తో ఏపీలో మ‌ద్యం కొన‌లేని పరిస్థితి.ఇప్పుడు ప‌క్క రాష్ట్రాల నుంచి తెప్పించుకోవ‌డానికి కూడా మందుబాబుల‌కు అవ‌కాశం లేకుండా పోయింది.

ప‌ర్మిట్ లేకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెచ్చుకోవ‌డానికి అనుమతి లేద‌ని తాజా ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది.అయితే ఇత‌ర దేశాల నుంచి మ‌ద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం అనుమ‌తి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం తెప్పించుకోవ‌డం వ‌ల్ల రాష్ట్రానికి ఆదాయం ప‌డిపోతుంది.దీని వ‌ల్ల ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు