1.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,539 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
2.ఢిల్లీ ఉపముఖ్యమంత్రి కి సిబిఐ లుకౌట్ నోటీసులు
మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తో పాటు 12 మంది వ్యక్తులకు సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
3.లోకేష్ పర్యటనలో ఉద్రిక్తత
నేడు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.పలాసకు లోకేష్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు, లోకేష్ ఆందోళన చేపట్టారు.
4.తిరుపతికి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి వచ్చారు.జనసేన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
5.నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది.
6.వైష్ణో దేవి యాత్ర పునః ప్రారంభం
కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్ర పట్నంలోని మాత వైష్ణో దేవి యాత్ర నుంచి పునప్రారంభం అయ్యింది.
7.నేడు మునుగోడుకు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు మునుగోడులో బిజెపి ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
8.ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
నేడు హైదరాబాద్ లో 34 ఎంఎంటిఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
9.తెలంగాణలో హరితహారం
నేటి నుంచి తెలంగాణలో హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు.
10.కేసీఆర్ పర్యటన
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు.
11.శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఐదవ సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మొత్తం 30 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా అన్నిటికీ ఆమోదం తెలిపినట్లు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
12.చంద్రబాబుపై అంబటి కామెంట్స్
తెనాలి వచ్చి చంద్రబాబు ఏదేదో మాట్లాడాలని ఈమధ్య వచ్చిన చాలా సర్వేలు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెల్చేయడం తో బాబు లో ప్రెస్స్టేషన్ పెరిగిపోయిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
13.చంద్రబాబు కామెంట్స్
ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్స్ చేశారు.
14.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.యాదాద్రి లో భక్తుల రద్దీ
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
16.ఢిల్లీ వెళ్ళనున్న జగన్
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు.నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
17.నారా లోకేష్ ప్రెస్ మీట్ ను అడ్డుకున్న పోలీసులు
నారా లోకేష్ విశాఖ లో నిర్వహించిన మీడియా సమావేశంను పోలీసులు అడ్డుకున్నారు.
18.అమిత్ షా తో భేటీ కానున్న ఎన్టీఆర్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో, సినీ నటుడు ఎన్టీఆర్ భేటీ కానున్నారు.
19.పోలీసులపై లోకేష్ ఆగ్రహం
పోలీసుల పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అగ్రహం వ్యక్తం చేశారు.తన పర్యటన ను అడుగడుగునా అడ్డుకోవడంతో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అని హితవు పలికారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,150
.