108 అంబులెన్స్ లపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణ, గోదావరి నది బోర్డు ల చైర్మన్ ల తో కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి గురువారం సమీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతున్నాయి.బుధవారం తిరుమల శ్రీవారిని 27,446 మంది భక్తులు దర్శించుకున్నారు.
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పరం బదిలీలపై త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3845 ప్రత్యేక బస్సులు నడపడానికి టిఎస్ఆర్టిసి ఏర్పాట్లు చేస్తోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్ రమణ, యాదవ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కి నూతన వెబ్సైట్ ను ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో కలిసి ప్రారంభించారు.
టిడిపి నిజ నిర్ధారణ కమిటీ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసింది.గుడివాడలో కేసినో నిర్వహించారని గవర్నర్ కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు.
వైసిపి కేసినో పార్టీ అని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోమవారం కామెంట్ చేశారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,86,385 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ఏర్పాటు చేయబోతున్న కొత్త జిల్లాలపై అప్పుడే అభ్యంతరాలు మొదలయ్యాయి.తూర్పు గోదావరి ఏజెన్సీ లో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరును ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు.వెంటనే దీనిపై కమిటీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం లో దారుణం చోటుచేసుకుంది.ఆలయానికి చెందిన పాత రథచక్రాలకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
ఏపీ పిఆర్సి జీవోలో కు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయి.ఈనెల 30వరకు కొనసాగిస్తున్నట్లు ఆ సంఘ నేతలు తెలిపారు.
ఏపీలో స్కూల్లో నిర్వహణపై నేడు అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాలలో మ్యాపింగ్ పై ఎమ్మెల్యేలకు మూడు రోజులపాటు అవగాహన కార్యక్రమం, బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటు పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రైవేటీకరణ లో భాగంగా నేడు ఎయిర్ ఇండియా ను టాటా గ్రూపు కు కేంద్రం అప్పగించనుంది.
నేడు పంజాబ్ లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గురువారం సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0 ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,500 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,450 .
తాజా వార్తలు
Download App
Channels
Home English News TeluguStop Exclusive Stories Flash/Breaking News Trending News Political Movie Health Tips Crime News Movie Reviews NRI News Viral Videos Bhakthi/Devotional Press Releases Viral Stories Quotes Photo Talks Baby Boy NamesBaby Girl Names Celebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.com Ph No : 999-279-9973
About Us!
About Us Jobs Advertising DMCA / Removal Terms of Use Privacy Policy