బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ఉదోగా సంఘాలు చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మార్ఫీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 35,747 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఏపీ న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి సీబీఐ పై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసుపై నేడు విచారణ జరిగింది.
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపునకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీకి వారం రోజులు గడువు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు.
దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడు 9 వ వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులు అర్పించారు.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో వైసీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా టిడిపి పై వారు ఫిర్యాదు చేశారు.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గాన సబ్బవరం దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీకి ఉపరాష్ట్రపతి వెళ్లారు.
యాసంగి వరి వేయొద్దని సిద్దిపేట కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాతుల నారాయణ అనే వ్యక్తి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టిఆర్ఎస్ పట్టణం ప్రారంభమైందని దేనికి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బిజెపి ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు.
విరాట పర్వం సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడని ఓ వెబ్సైట్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
ఆ ఆర్టికల్ లింక్ షేర్ చేస్తూ ఎవడు బ్రో నీకు చెప్పింది .నీ సోది " అంటూ రాణా ట్వీట్ చేశారు.
ఈ నెల 12న హైదరాబాద్లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
తెలంగాణ ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ లకు టీఆర్ఎస్ 503 ఓట్లు, బీజేపీ కి 159 ఓట్లు, కాంగ్రెస్ కు 35 ఓట్లు పోలవ్వగా, చెల్లనివి 14 ఓట్లు పొలయ్యాయి.
అమరావతి పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేము అని , రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు టీడీపీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రజల ఆస్తులను దోచుకోకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,850 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,850 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy