భారత రాష్ట్రపతి ద్రౌపది నేడు యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఏపీ సీఎం జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.
నకిలీ పాస్ పోర్ట్ కేసులో నేడు బెయిల్ పై చంచల్ కూడా జైలు నుంచి రామచంద్ర భారతి విడుదల కానున్నారు.
నేడు హైకోర్టులో మాచర్ల టిడిపి నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
నేడు పోలవరంలో రెండో రోజు పీపీఏ బృందం పర్యటిస్తోంది.
నేడు భద్రాచలం రామాలయంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.బలరాం అవతారంలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోది మాతృమూర్తి హీరాబెన్ మోది మరణించారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.
నిజామాబాద్ పిఎఫ్ ఐ కేసులో ఎన్ఐఏ 11 మంది పై చార్జిషీట్ దాఖలు చేసింది.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా వద్ద ఏర్పాటుచేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచుడ్ ప్రారంభించారు.
ఏపీ సీఎం జగన్కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేక రాశారు.
ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అయింది.రెచ్చగొట్టేలా ప్రసంగించారు అంటూ పరిటాల శ్రీరామ్ పై 153 ఏ, 505 సెక్షన్ల కింద ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల అభివృద్ధికి మొదటి సంతకం చేస్తానని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో ఏం సాధించారో చెప్పాలని , వెంటనే దీనిపై ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి మృతి చెందడంపై పాక్ ప్రధాని షేహాబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు.
కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చంద్రబాబు పై మండిపడ్డారు.ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు డిజిపి ఆఫీసుకు కేఏ పాల్ వెళ్లారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మచిలీపట్నం మాజీ ఎంపీ , టీడీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు నారాయణరావు కోరారు.
కెసిఆర్ ప్రభుత్వం పై త్వరలోనే చార్జిషీట్ విడుదల చేస్తామని బిజెపి ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు భారీగా ఆందోళనకు దిగారు.
తెలంగాణ టార్గెట్ బిజెపి పోరాడుతోందని త్వరలోనే తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy