కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి ఈ నెల ముప్పై వరకు డెడ్ లైన్ విధిస్తున్నాం అని, అప్పటికీ స్పందించకపోతే వచ్చే నెల 2 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.
ఫించన్ లపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని కలెక్టర్లు తిప్పికొట్టాలి అని ఏపీ సీఎం జగన్ సూచించారు.
దేశంలోనే అత్యధికమంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం కు గుర్తింపు లభించింది.ఈ మేరకు ఓయూ కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ విడుదలయ్యింది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భద్రాచలం ఎమ్మెల్యే సోదెం వీరయ్య భేటీ అయ్యారు.
ఏపీలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
తెలంగాణ శాసన సభ తీరును పంజాబ్ శాసనసభ స్పీకర్ కుల్జార్ సింగ్ సంద్వాన్ సందర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ శాసన సభ నిర్వహణ తీరును ఆయన ప్రశంసించారు.
హీరా గోల్డ్ కేసులో ఆ సంస్థ ఎండీ నోహిరా షేక్ ను ఈడి అధికారులు విచారించారు.
అవాంచిత కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ చర్యలు చేపట్టింది.టెలికాం నెట్ వర్క్ నేమ్ డిస్ప్లే సిస్టమ్ అమలుకు చర్యలు మొదలుపెట్టింది.
దళితులకు జరుగుతున్న అన్యాయాలపై సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు పై కార్పొరేషణ్ ల నిర్వీర్యం చేయడంపై రేపు ఉదయం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు తెలిపారు.
ఏపీలో మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో ధర్నాలు చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని సిపిఎం కార్యదర్శి శ్రీనివాస్ విమర్శించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలతో సంబంధం లేకుండా అంతా ఏకం కావాలని పార్టీలు అభిప్రాయాలు వేరైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం అని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు పిలుపునిచ్చారు.
బాసరలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై భూకబ్జా ఆరోపణలు రావడంతో వెంటనే అధికారులు భూకబ్జా ఆరోపణలపై విచారణ చేపట్టారు.
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
కర్ణాటకలో 6 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు క్యాబినెట్ తీర్మానించింది.
రాష్ట్రపతి ద్రౌపది రేపు ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు.
ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులు వీడియో దర్యాప్తు కొనసాగుతోంది.నేడు విచారణకు హాజరు కావలసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విచారణకు గైర్హాజరయ్యారు.
విపక్షాలను ఆడిపోసుకోడం బీఆర్ ఎస్ నేతలకు సర్వసాధారణంగా మారిపోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.
నాజల్ వాక్సిన్ ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది.ప్రవేట్ ఆసుపత్రులలో ఒక్కో డోస్ రూ.800 గా నిర్ణయించింది.
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తో ఆయన భేటీ కానున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy