ఆంధ్రప్రదేశ్లో 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే నెలలు, సంవత్సరాలు గడుస్తున్న ఈ కేసులో దోషులు ఎవరో ఇంతవరకు తేలలేదు.
కానీ విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయనే వార్తలు మాత్రం ప్రజలను తికమకకు గురి చేస్తున్నాయట.
ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉందనే అనుమానంతో అరెస్ట్ చేసిన వారిని విచారిస్తున్న క్రమంలో మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చిందట.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఆయన ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానిత వాహనాలు తిరిగినట్టు సీబీఐ గుర్తించింది.కాగా ఒక ఇన్నోవా కారు యజమానిని, దీని డ్రైవర్ను సీబీఐ విచారించినట్టు సమాచారం.
ఇకపోతే హత్యకు ముందు ఇన్నోవా కారులో వచ్చిన వారు ఎవరనే పరిశోధనలో సీబీఐ మునిగిపోయిందట.అయినా ఒక రాష్ట్రానికి సీఎం బాబాయి హత్య చేయబడితే ఇప్పటి వరకు నిజనిజాలు బయటకు రాకపోవడం వెనక ఉన్న రహస్యం ఏంటో అని ఏపీ ప్రజలు అనుమానపడుతున్నారట.