దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది.తాజాగా ఒక కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 7కు పెరిగింది.
ఢిల్లీలోని శారదా విహార్ లో నైజీరియాకు చెందిన ఓ మహిళ నాలుగు నెలలుగా నివాసం ఉంటోంది.ఇటీవల చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది.
ఈ క్రమంలో ఆమె శాంపిల్స్ ను పూణె వైరాలజీ ల్యాబ్ కు పంపగా.రిపోర్టులో మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.