ఢిల్లీలో మ‌రో మంకీపాక్స్ కేసు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో మంకీపాక్స్ క‌ల‌క‌లం రేపుతోంది.తాజాగా ఒక కేసు న‌మోదు కావ‌డంతో బాధితుల సంఖ్య 7కు పెరిగింది.

ఢిల్లీలోని శార‌దా విహార్ లో నైజీరియాకు చెందిన ఓ మ‌హిళ నాలుగు నెల‌లుగా నివాసం ఉంటోంది.

ఇటీవ‌ల చ‌ర్మంపై ద‌ద్దుర్లు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరింది.ఈ క్ర‌మంలో ఆమె శాంపిల్స్ ను పూణె వైరాల‌జీ ల్యాబ్ కు పంప‌గా.

రిపోర్టులో మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిందని వైద్యులు తెలిపారు.

పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?