హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు నమోదు అయింది.భారత్ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లు విక్రయం, తొక్కిసలాటపై ఇప్పటికే మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
తాజాగా హెచ్సీఏపై మరో కేసును బేగంపేట పోలీసులు నమోదు చేశారు.మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభానికి వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో.
హెచ్సీఏ తప్పుడు టైమింగ్ ఇచ్చిందని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో హెచ్సీఏపై ఇప్పటివరకు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.