శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్ ఓంకార్?

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఈయన హైదరాబాదులోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

కరోనా మహమ్మారి రావడం, ఊపిరితిత్తులకు 75శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన మృతి చెందారు.ఇక శివ శంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

శివ శంకర్ మాస్టర్ మరణంతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు అందరు కూడా సంతాపాన్ని ప్రకటించారు.కాగా శివ శంకర్ మాస్టర్ భౌతిక కాయానికి మహాప్రస్థానం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

నిన్న అనగా సోమవారం సాయంత్రం శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.హైదరాబాద్ ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలో అతని చిన్న కుమారుడు అజయ్, భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Advertisement

అయితే అంతకు ముందే పంచవటి కాలనీలోని నివాసానికి నటీనటులతో పాటు కళాకారులు కూడా హాజరై శివ శంకర్ మాస్టర్ కు నివాళులు అర్పించారు.

ఇక కుటుంబ సభ్యులతో పాటుగా, టాలీవుడ్ యాంకర్, నిర్మాత, దర్శకుడు ఓంకార్ తో పాటు అతని తమ్ముడు అశ్విన్ బాబు కూడా శివ శంకర్ మాస్టర్ పాడే మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఒకప్పుడు ఓంకార్ షోలో శివ శంకర్ మాస్టర్ జడ్జిమెంట్ అంటే ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు శివ శంకర్ మాస్టర్.

ఇక శివ శంకర్ మాస్టర్ హాస్పటల్లో ఉన్న సమయంలో సోను సూద్, చిరంజీవి, ధనుష్ లాంటి వారు ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు