అమెరికన్ దిగ్గజ కంపెనీ ‘‘ స్టార్‌బక్స్‌’’కి సీఈవోగా భారతీయుడు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కోవలో మరో దిగ్గజ అమెరికన్ కంపెనీ స్టార్ బక్స్కు సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు.

అలాగే స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోనూ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు.ఈ నియామకం ద్వారా గ్లోబల్ కంపెనీలను ఏలుతున్న భారతీయ సీఈవోల లిస్ట్‌లో లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు.

అక్టోబర్ 1న లక్ష్మణ్ కంపెనీలో చేరుతారని.కానీ 2023 ఏప్రిల్‌లో సీఈవోగా బాధ్యతలు చేపడతారని స్టార్‌బక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

అప్పటి వరకు హోవార్డ్ షుల్ట్జ్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వెల్లడించింది.

55 ఏళ్ల లక్ష్మణ్ ప్రస్తుతం రెకిట్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.పూణే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన.పెన్సిల్వేనియా వర్సిటీ అనుబంధ లాడర్ ఇన్స్‌స్టిట్యూట్ నుంచి జర్మన్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేచేశారు.అలాగే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.

రెకిట్‌లో ప్రవేశించడానికి ముందు పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన లక్ష్మణ్.లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేవారు.అలాగే మెకిన్సే కంపెనీలో సీనియర్ పార్ట్‌నర్‌గానూ లక్ష్మణ్ పనిచేశారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు