అఖిల్ తో సినిమా విషయంలో చైతూ ఇలా అనేశాడేంటీ!

టాలీవుడ్‌ లో మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ముఖ్యంగా ఫ్యామిలీ మల్టీ స్టారర్ సినిమా ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకే మంచు వారు లేదా మరెవ్వరైనా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ లతో వస్తే తెగ చూసేస్తారు.సినిమా టాక్ తో సంబంధం లేకుండా చూసేస్తారు.

ఆచార్య సినిమా ప్లాప్ అయినా కూడా చిరంజీవి మరియు చరణ్‌ నటించడం వల్ల ఎంతగా ఆధరించారో మనం చూశాం.ఆ సినిమా అంతో ఇంతో రాబట్టింది అంటే ఇద్దరు కలిసి నటించడమే.

అందుకే అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మళ్లీ మనం తరహా మల్టీ స్టారర్ కావాలని కోరుకుంటున్నారు.అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది క్లారిటీ లేదు.

Advertisement

మనం లో ఏయన్నార్‌ నటించారు.ఆయన లేని లోటును అఖిల్ భర్తీ చేసి ఆయన ప్లేస్‌ లో నటిస్తే బాగుంటుందేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.థాంక్యూ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా నాగ చైతన్య మాట్లాడుతూ మల్టీ స్టారర్‌ సినిమా ల విషయంలో చాలా పాజిటివ్ వ్యాఖ్యలు చేశాడు.

కాని అఖిల్ తో సినిమా విషయం లో మాత్రం కాస్త విభిన్నంగా స్పందించాడు.అఖిల్ తో సినిమా అంటే కథ చాలా స్పెషల్‌ గా ఉండాలి.

ఇద్దరం కలిసి ఖచ్చితంగా సినిమా చేయాలని నాకు కూడా ఉంది.కాని కథ అంత సులభంగా దొరుకుతుందని నేను అనుకోవడం లేదు అన్నట్లుగా ముందుగానే కథ విషయంలో రచయితలకు మరియు దర్శకులకు వార్నింగ్‌ ఇచ్చినట్లుగా చెప్పేశాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ప్రతి సినిమా కూడా మనం వంటి కథతో రావాలంటే కష్టం.కనుక కొన్ని సార్లు కథ విషయంలో పట్టు విడుపు ఉండాలని.

Advertisement

స్పెషల్‌ కథ అనే విషయం పక్కన పెట్టి అఖిల్‌ తో సినిమా చేసేందుకు మంచి కథ ను ఎంపిక చేసుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు