'బ్యాచిలర్' కోసం కత్తెర పట్టిన నాగ్.. ఓకే చెప్పిన టీమ్!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన విషయం తెలిసిందే.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.

ఇందులో అఖిల్ పూజా హెగ్డే తో రొమాన్స్ చేసాడు.అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

కానీ ఇన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు దసరా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా దసరా రోజు అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.ఇక అఖిల్ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు.

Advertisement

నాగార్జున కూడా ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.అయితే ఇప్పుడు ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసారని టాక్ వినిపించింది.అయితే ఇప్పుడు సినిమా విడుదల కూడా దగ్గర పడుతుంది.

ఈ సమయంలో మళ్ళీ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలనీ నాగార్జున కోరుతున్నాడట.అయితే అవి ఎడిటింగ్ విషయంలో అవ్వడంతో చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

నాగార్జున తన అనుభవంతో సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయాలనీ చెప్పాడట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

నాగార్జున ప్రేక్షకుడి ద్రుష్టి కోణంతో ఆలోచించి జడ్జెమెంట్ ఇస్తారు.అందుకే నిర్మాత అల్లు అరవింద్ కూడా నాగార్జున చెప్పిన సన్నివేశాలను ఎడిట్ చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక దసరా సీజన్ లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు