కోవిడ్ రోగుల కోసం అక్కడ ఎయిర్ అంబులెన్స్ కూడా....

కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం విదితమే.ముఖ్యంగా కర్ణాటక లో ఈ మహమ్మారి స్వైర విహారం చేస్తుంది.

 Air Ambulances For Covid Patients, Air Ambulance, Emergency Services,cm Yediyura-TeluguStop.com

కర్ణాటక లోని ఒక్క బెంగుళూరు నగరంలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.అయితే అక్కడ కరోనా రోగులకు సేవలు అందించేందుకు త్వరలో ఎయిర్ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.

ఈ నెల నుంచే ఈ ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రజలకు అందించనున్నట్లు సమాచారం.దీనితో ఈ సేవలను అందించే తొలి విమానాశ్రయంగా బెంగళూరులోని జక్కూర్ విమానాశ్రయం నిలవబోతోంది.

హెలికాప్టర్, విమానం అంబులెన్స్ సేవలు ఈ నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.మారుమూల గ్రామాల నుంచి సైతం రోగులను తీసుకొచ్చేందుకు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

రోగులకు ఈ ఎయిర్ అంబులెన్స్ లో అత్యవసరంగా సేవలు అందించడం కోసం ఒక వైద్యుడు,పారా మెడికల్ అధికారి, నర్సు,ఇద్దరు పైలట్లు అందుబాటులో ఉండనున్నారు.ఈ సేవలను ఐకాట్ క్యాథి ఎయిర్ అంబులెన్స్ నిర్వహిస్తోంది.

ప్రస్తుతం ఈ సంస్థ ముంబై,ఢిల్లీ వంటి నగరాల్లో కూడా సేవలను అందిస్తుండగా,బెంగుళూరు లో కూడా ఈ ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించేందుకు సీఎం యడ్యూరప్ప అంగీకరించినట్లు ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube