ఆర్జీవీ తర్వాత సందీప్ వంగనే వాటిని బ్రేక్ చేసాడు.. రాజమౌళి సెన్సేషనల్ వ్యాఖ్యలు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) ఏ సినిమా చేసిన అది సంచలనమే అని చెప్పాలి.

ఎందుకంటే సందీప్ రెడ్డి రెడ్డి వంగ చేసిన సినిమాలన్నీ కాంట్రవర్సీలను క్రియేట్ చేసిన తర్వాతనే హిట్ అయ్యాయి.

అలాగే ఈయన సినిమాల్లో రొమాన్స్, బోల్డ్ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో యాక్షన్ అంతకు మించి ఉంటుంది.

మరి ఇదే విషయంపై తాజాగా టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సందీప్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో యానిమల్( Animal Movie ) ఒకటి.

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న యానిమల్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుపుకుంది.

Advertisement

మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరుగగా ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అగ్ర డైరెక్టర్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు.మరి ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఎంతో నచ్చాయని.

నిజానికి తాను అందరికంటే ముందుగానే యానిమల్ సినిమాను చూస్తున్నట్టు తెలిపారు.అంతేకాదు టాలీవుడ్ లో గల కొన్ని ఫార్ములాలు, నార్మ్స్ ను బ్రేక్ చేసి గతంలో ఆర్జీవీ మాత్రమే సినిమాలు చేసారని.

ఇప్పుడు ఆర్జీవీ తర్వాత సందీప్ వంగ మాత్రమే ఇటువంటి మూవీస్ తీస్తున్నారని.తప్పకుండ యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని జక్కన్న ( Rajamouli ) చెప్పుకొచ్చారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు