ఆదిపురుష్ విడుదల వేల.. భద్రాచలానికి భారీగా విరాళం ఇచ్చిన ప్రబాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) కృతి సనన్ (Kriti sanan) హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్ (Aadi Purush).

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా జూన్ 16వ తేదీ హీరో ప్రభాస్ భద్రాచలాని(Bhadrachalam)కి భారీ స్థాయిలో విరాళాలను అందించారు.

భద్రాచలం క్షేత్రం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది.రోజుకు కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.రాముడి జీవితం ఇతివృత్తంగా ఆది పురుష్ సినిమా రూపొందుతున్న వేళ.రాముడిని కొలిచే భక్తుల కోసం ఏదైనా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే దక్షిణ అయోధ్యగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భద్రాచలంలోని రాములవారి అన్నదాన సత్రానికి 10 లక్షల విరాళం ప్రకటించాడు.

Advertisement

యూవీ క్రియేషన్స్ ప్రతినిధి ద్వారా భద్రాచలం రామాలయ ఈవో రమాదేవికి 10 లక్షల(10 Lakh Rupees) కు సంబంధించిన చెక్కును శనివారం అందజేశారు.

ఇలా ప్రభాస్ భక్తుల అన్నదానం కోసం పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అయితే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ చూసి ఎంతోమంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నోవివాదాలను ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం విడుదలైనటువంటి టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది.మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు