భర్త మరణంపై స్పందించిన నటి మీనా.. దయచేసి అలాంటి వార్తలు రాయొద్దంటూ!

తెలుగు సీనియర్ నటి మీనా భర్త ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ తాజాగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

భర్త మరణంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది.అయితే ఈమె భర్త చనిపోయిన తరువాత సోషల్ మీడియాలో విద్యాసాగర్ మృతి పట్ల అనేక రకాల అసత్య ప్రచారాలు వినిపిస్తున్నాయి.

కాగా ఇదే విషయాలపై భర్త చనిపోయిన తరువాత మొదటిసారిగా స్పందించింది మీనా.సోషల్ మీడియాలో వినిపిస్తున్న అసత్య ప్రచారలపై ఆమె విచారం వ్యక్తం చేసింది.

తన భర్త అసత్య ప్రచారాలు చేయవద్దు అని ఆమె కోరింది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె ఒక భాగోద్వేగా పోస్టును షేర్ చేసింది.

Advertisement

భర్త దూరమయ్యారు అన్న బాధలో ఉన్నాను.ఈ సమయంలో మా కుటుంబం ప్రైవసీక భంగం కలిగించకండి దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి.

విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దు అని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

అదేవిధంగా నా భర్తను ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించి ఎంతో కృషి చేసిన వైద్య బృందానికి,తమిళనాడు సీఎం,ఆరోగ్య మంత్రి,ఐఏఎస్ రాధాకృష్ణన్,సన్నిహితులు,మిత్రులకు నా కృతజ్ఞతలు అని తెలిపింది మీనా.అదేవిధంగా ఆయన భర్త కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు అని తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది మీనా.ఈ పోస్ట్ పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు