కమెడియన్ పృథ్వీరాజ్.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
ఈయన వైసిపి పార్టీ లోకి ఉంటూ సీఎం జగన్ పై వీర విధేయత ప్రదర్శిస్తూ టిడిపి పార్టీని, అలాగే జనసేన పార్టీ నాయకులని నోటికొచ్చినట్లు తిడుతూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి నోటికి వచ్చినట్టు తిడుతూ స్థాయిని మరిచి మరి ప్రవర్తించాడు కమెడియన్ పృథ్వీరాజ్.
అలా ఇతని కష్టాన్ని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఎస్విబిసి చైర్మన్ ని చేగ అక్కడ ఒక మహిళ ఉద్యోగుతో రాసలీలలు జరపడంతో పదవి కాస్త ఊడిపోయింది.
దీనితో కమెడియన్ పృథ్వీరాజ్ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తాడు.
జనసేన జెండాను మూసేందుకు రెడీ అయ్యారు.అయితే పృథ్వీరాజ్ పవన్ కళ్యాణ్ ను కలవలేదు ఆ పార్టీలో చేరను లేదు.
అంతేకాకుండా జనసేన సైనికులు ఈ పృథ్వీరాజ్ ను పార్టీలోకి కూడా ఆహ్వానించడానికి ఒప్పుకోలేదు.అటువంటిది జనసేన పార్టీలో ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు కూడా చెప్పేస్తున్నాడు పృథ్వీరాజ్.
ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో ఆ భీమవరం నుంచి తాను బీఫామ్ తీసుకొని వైసిపిని ఓడిస్తాను అంటూ శపదాలు చేస్తున్నాడు.
2019లో చేసిన పొరపాటు 2024 లో రిపీట్ కాకూడదని, ఈసారి భీమేశ్వర స్వామి అగ్నిసాక్షిగా అనూహ్యమైన ఫలితం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా గెలిచి తీరతారు ఇది మేము రాసిస్తాము అంటూ పెద్ద పెద్ద నినాదాలు సభదాలు చేస్తున్నాడు.వైసిపి ప్రభుత్వం మారాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ తప్పకుండా సీఎం కావాలని కోరుకుంటున్నట్టే లెక్క ఇందులో ఎటువంటి సందేహం లేదు అని తెలిపారు పృథ్విరాజ్.