తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ స్కాం( Sheep Distribution Scam ) కేసులో ఏసీబీ( ACB ) అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు సంబంధించిన ఓల్డ్ వీడియో బయటకు వచ్చింది.
కాగా ప్రస్తుతం కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.పశు సంవర్ధక శాఖ( Animal Husbandry Department ) అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ వీడియో ఉందని తెలుస్తోంది.
అవినీతి అధికారులకు జైల్లో చిప్పకూడు తినిపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.తాజాగా తన అవినీతి బయటపడటంతో మొయినుద్దీన్ విదేశాలకు పారిపోయారు.ఈ క్రమంలో మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రమ్ పై ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.