మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది.నాసిక్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.







