ఖమ్మంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి పేరుతో లేఖ.. తీవ్ర కలకలం

ఖమ్మంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పేరుతో ఉన్న ఓ లేఖ తీవ్ర కలకలం సృష్టించింది.

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ పేరుతో లేఖ విడుదలైందని తెలుస్తోంది.

కార్పొరేట్ ఏజెంట్లకు ప్రధాన పార్టీలు సీట్లు ఇస్తున్నాయని మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ లేఖలో పేర్కొన్నారు.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ కార్పొరేట్ రాజకీయ నాయకులేనని లేఖలో తెలిపారని సమాచారం.

ఈ క్రమంలో వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆజాద్ తెలిపారు.

పార్టీకి సేవ చేసిన వారికి కాకుండా తన అనుచరులకు సీట్లు ఇప్పించేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి లేఖ రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
వాలంటీర్ల విషయంలో సస్పెన్స్ .. వాటిని తొలగించాలంటూ ఆదేశాలు 

తాజా వార్తలు