దేశంలో క్రమ క్రమంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధలను విధించాయి.
కోవిడ్ నియంత్రణ నియమాలను పాటించాలని ఆదేశించాయి.ఈ నేపధ్యం లో పాఠశాలలకు కూడా హాలీడేస్ ప్రకటించారు.
అయితే ఎక్కడైతే స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయో అక్కడ ఈ కరోనా వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ దశలో పలు చోట్ల కరోనా కేసులు బయట పడుతున్నాయి.
ఇకపోతే ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్లుగా ఎక్కువగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో తాజాగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని ఓ కార్పొరేట్ స్కూల్ లో ఏకంగా 55 మంది విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందట.
దీంతో ఇక్కడ కాస్త ఆందోళన నెలకొంది.కాగా కరోనా దెబ్బకు స్కూలును మూసివేసి, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని యాజమాన్యాన్ని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.