‘శ్రీమంతుడు’ చిత్రంతో శృతిహాసన్ క్రేజ్ టాలీవుడ్లో బాగా పెరిగింది.ప్రస్తుతం ఈమెను తమ సినిమాలో బుక్ చేసుకునేందుకు పలువురు స్టార్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలు క్యూలో ఉన్నారు.
తాజాగా ఈమె రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పింది.అందులో మొదటిది యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీ.
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ అంతకు ముందే ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుంది.
దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి వచ్చే సంవత్సరం సంక్రాంతి నుండి రెగ్యులర్ షూటింగ్ను చేయనున్నారు.
ఎన్టీఆర్తో సినిమా తర్వాత మహేష్బాబుతో మరోసారి శృతిహాసన్ హీరోయిన్గా నటించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్న మహేష్బాబు ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.వచ్చే వేసవిలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లబోతుంది.
ఆ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ను దర్శకుడు మురుగదాస్ ఎంపిక చేశాడు.ఈ రెండు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇలా శృతిహాసన్ వెంటే అంతా ఇప్పుడు పడుతున్నారు.శృతిహాసన్ తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో సైతం ఈ అమ్మడు నటిస్తుంది.