మీడియాకు పవన్‌ సారీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు పవన్‌ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్‌ మరియు అయ్యన్న పాత్రడు నానక్‌ రామ్‌గూడాలోని ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సెట్‌కు వెళ్లారు.

మంత్రులతో పాటు మీడియా కూడా షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లారు.

పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత సిబ్బంది మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియాతో దురుసుగా వ్యవహరించారు.కొందరు ఏకంగా మీడియా పర్సన్స్‌పై దాడికి దిగారు.

దాంతో కొందరికి గాయాలు కూడా అయ్యాయి.మీడియాపై తన సిబ్బంది దాడిని పవన్‌ ఖండించాడు.

ఈ సందర్బంగా మీడియాకు పవన్‌ కళ్యాణ్‌ క్షమాపణలు చెప్పాడు.ఇలాంటిది మరోసారి జరగదని మీడియాకు తెలియజేశాడు.

Advertisement

పవన్‌ వెంటనే క్షమాపణలు చెప్పడంతో మీడియా వారు శాంతించారు.పవన్‌ అభిమానులు సైతం తమ హీరో గొప్పదనాన్ని మెచ్చుకుంటున్నారు.

ఇక అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలని ఉన్నా కూడా తాను ఆ సమయంలో గుజరాత్‌లో షూటింగ్‌లో ఉంటాను.అప్పటికి శంకుస్థాపనకు వస్తానా లేదో అనేది చెప్పలేను అన్నాడు.

Advertisement

తాజా వార్తలు