ఆంధ్రప్రదేశ్ శాసన సభ అదుపు తప్పిపోయింది అని చెప్పడానికి బుధవారం నాటి సభ సమావేశమే ప్రభల సాక్ష్యం .ఇటు ప్రధానపక్షం అటు ప్రతిపక్షం దొందూ దొందేగా టీవిల సాక్ష్యం గా వీక్షకుల తీర్పుకు గురయ్యారు.
టివిలు చూసే అన్ని పార్టీల వారు ముక్కున వేలేసుకున్నారు.ఏకంగా కళ్ళముందే ఏదేదో జరిగిపోతోంది .ఎందుకిలా జరుగుతోంది అని ఎవరికి వారే అనుకునే పరిస్థితి నేలకొన్నందుకు ఇది మన ప్రజాస్వామ్యం అని పెదాలు విరిచేసారు .వాస్తవానికి అధికార పక్షం మేము చెప్పింది విని పోకుండా అడుగడుగునా ఈ నిలదీతలేమిటి అని గుర్రెత్తి పోతోంది.ప్రతిపక్షంలో ఉన్నాము మన సత్తా చాటుదామనే తలంపు తో నానా రకాల ప్రశ్నలు సంధించేసి జనాలతో ఆహా, ఓహో అనిపించుకున్దామని తపనతో ప్రతిపక్షం, ఆ సభ్యులు ఉన్నారు.