ఉన్నదీ పోయింది…తెచ్చుకున్నదీ పోయింది అని అంటారు కదా పెద్దవాళ్ళు.ఇప్పుడు కొంగ్రెస్ పరిస్థితి చూస్తే అలానే ఉంది.
పాపం ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని విడదీసేస్తే తెలంగాణాను తన ఖాతాలో వేసుకోవచ్చు అని అనుకున్న కాంగ్రెస్ కు రెండు రాష్ట్రాల్లో చావు దెబ్బ తగిలింది.అయితే ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఆ పార్టీ కొంచెమైనా ఆలోచించి మాట్లాడితే వారు చెప్పుకుంటున్న 120ఏళ్ల చరిత్రకి ఒకింత అర్ధం ఉంటుంది.
విషయం ఏమిటంటే తెలంగాణా ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు అని కొంగ్రెస్ నేతలు ఇంకా అదే డబ్బా కొడుతున్నారు.సాగర్ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రెండో పంటకు నీళ్లు రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
బుధవారం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.బాబుపై తిరగబడాలని ఆయన తెలంగాణలోని ఆ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.
సాగర్ ఎడమ కాలువ నుంచి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపైనా రెండో పంటకు నీళ్లు ఇచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని అన్నారు.రాష్ట్రంలో స్వైన్ ఫ్లూతో జనాలు మరణిస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఆవేదన న్యాయమయిందే కానీ దానికి చంద్రబాబుపై దండ యాత్ర చేస్తే ఎలా దాని గురించి వారు నిలదీయాల్సింది తమ ముఖ్యమంత్రి గారిని అన్న సంగతి మరచారు అనుకుంట.