రాజన్న సిరిసిల్ల జిల్లా :బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు 78వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ గారు మాట్లాడుతూ 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మంది ఆసువులు బసి మనకి స్వాతంత్ర్యాన్ని అందించారు,భరతమాత దాస్య విశృంకరలు తెంచుకొని,స్వేచ్చ వాయువులు పిలుస్తున్న రోజు ఈరోజు,భారత పథకం విను విధుల్లో రీరెపలడుతున్న రోజు ఈరోజు,తమ ధన ,మన ప్రాణాలను లెక్కజేయకుండ భరతమాత కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆనాటి మహనీయుల గొప్ప త్యాగాల ఫలితం,దేశ ప్రజలందరూ కలలు పండిన రోజు ఈరోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం రోజు.
ప్రతి మహనీయుల చరిత్రను స్మరించుకుందాం,వారి చూపిన బాటలో నడుస్తూ దేశాన్ని కాపాడుకుందాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పడాల గణేష్,గడ్డం రవి,మీసాల రవీందర్, కర్నవత్తుల వేణు,మొగుళ్ళ శ్రీహరి,అక్కేనపల్లీ నర్సింగరావు, తాళ్ళపల్లి బాల కిషన్ రావు,పడాల నరేష్,మంచే వసంత్,పండుగు గంగాధర్, నంద్యాడపు రెడ్డి,మీసాల రమేష్, పెద్ది శ్రవణ్,లక్కాకుల హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.