రైతుల కళ్ళల్లో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

సూర్యాపేట జిల్లా: రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని పెన్ పహాడ్ శ్రీ వెంకటేశ్వర ఎల్ 24 లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ సంజీవ రెడ్డి అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనంతారం,పెన్ పహాడ్, నాగుల పహాడ్ గ్రామాలకు చెందిన రైతులు సమావేశమై శ్రీ వెంకటేశ్వర ఎల్ 24 లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ గా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 Congress Government Aim Is Happiness In The Eyes Of Farmers, Congress Government-TeluguStop.com

ఈ సందర్భంగా లిఫ్ట్ కింద ఉన్న పొలాలకు సాగు నీరు విడుదల చేసిన నూతన చైర్మన్ మాట్లాడుతూ రైతుల కోసం రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.రైతులకు సకాలంలో నీటిని అందించడం చాలా ఆనందంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని,ఈ ప్రభుత్వం ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సైదిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి,రాంబాబు, మామిడి రవి,సామ సురేందర్,వెంకన్న, పరంధాములు,రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube