రైతుల కళ్ళల్లో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

సూర్యాపేట జిల్లా: రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని పెన్ పహాడ్ శ్రీ వెంకటేశ్వర ఎల్ 24 లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ సంజీవ రెడ్డి అన్నారు.

బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనంతారం,పెన్ పహాడ్, నాగుల పహాడ్ గ్రామాలకు చెందిన రైతులు సమావేశమై శ్రీ వెంకటేశ్వర ఎల్ 24 లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ గా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా లిఫ్ట్ కింద ఉన్న పొలాలకు సాగు నీరు విడుదల చేసిన నూతన చైర్మన్ మాట్లాడుతూ రైతుల కోసం రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

రైతులకు సకాలంలో నీటిని అందించడం చాలా ఆనందంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని,ఈ ప్రభుత్వం ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సైదిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి,రాంబాబు, మామిడి రవి,సామ సురేందర్,వెంకన్న, పరంధాములు,రైతులు పాల్గొన్నారు.

ట్రావెల్ వీసా రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన ఆ కంట్రీ.. వాళ్లకి బుర్ర లేదా?