రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రమాదం జరిగితే తప్ప కరెంట్ అధికారులు(Current officers ) స్పందించరా అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఎల్లారెడ్డి పేట( )లో గల ఎనిమిదవ వార్డులో ఉమాశంకర్ పంతులు ఇంటి దారిలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు.
అట్టి విద్యుత్ స్తంభం అడుగు భాగంలో స్తంభం ఏర్పాటు చేసేటప్పుడు వేసిన ఇనుప చువ్వలు బయటకు వచ్చి ఎప్పుడు విరిగి కింద పడుతుందో అని తెలియని దుస్థితి నెలకొంది.
ప్రమాదకర స్థాయిలో ఉన్న విద్యుత్ స్తంభం( Electric pole ) ను స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పరిశీలించి నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ ఏ ఈ పృథ్వీ ధర్ ను కోరారు.
ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట పారిపెళ్లి రాంరెడ్డి, యమగొండ కిష్టారెడ్డి, నేవూరి నర్సింహ రెడ్డి లు అన్నారు
.






