చంద్రబాబు నాయుడుకు ( Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్నా ఈ 14 సంవత్సరాలలో ఆయన సంక్షేమం గురించి ఏరోజు ఆలోచించలేదు.పేదలకు మంచి చేసేలా చంద్రబాబు నాయుడు కొత్త పథకాలను ప్రకటించలేదనే సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మాత్రం ఎక్కువ సంఖ్యలో పథకాలను అమలు చేస్తానని జగన్( Jagan ) మించిన సంక్షేమం తాను చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు సంచలన ఆడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆ ఆడియో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
వైరల్ అవుతున్న చంద్రబాబు ఆడియోలో ఆయన పథకాల్లేవ్ ఏం లేవ్ మొత్తం బడ్జెట్ ను అమరావతికి కుమ్మరిస్తామని చెప్పుకొచ్చారు.మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయని త్వరలో మీకు లాభాలు చూపిస్తానని బాబు కామెంట్లు చేసిన ఆడియో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఆడియో గురించి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.ఈ ఆడియోను విన్న వాళ్లు మాత్రం ఈ వాయిస్ బాబు వాయిస్ అని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెబుతుండటం గమనార్హం.పథకాల్లేవ్ ఏం లేవ్ అంటూ చంద్రబాబు చెప్పడంతో బాబు మాటలు, హామీలు నీటి మీద రాతలు అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను, నమ్మిన ఓటర్లను మోసం చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వైరల్ అవుతున్న ఆడియో ద్వారా అర్థమవుతోంది.బాబు ఇంతలా మోసం చేస్తారని అస్సలు ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం కల్ల అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బాబుకు ఈ ఎన్నికలు భారీ షాకులు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.







