అగ్రరాజ్యం అమెరికా) America _లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కాలేజీకి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారని సమాచారం.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన యూఎస్ పోలీసులు( US Police ) మృతులు కరీంనగర్ జిల్లాకు చెందిన నివేశ్ మరియు జనగామకు చెందిన గౌతమ్ గా గుర్తించారు.ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.