చిత్తూరు జిల్లా: నామినేషన్ వేసేందుకు నిభందనలు ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తున్న కుప్పంలో టీడీపీ ఒక రూలు, వైసీపీ కి ఒక రూలు అనే మాదిరి తయారయ్యింది.100మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలను RO కార్యాలయం వద్దకు వెళ్ళకూడదు.
అదేవిధంగా చంద్రబాబు నామినేషన్ వేసినప్పుడు కూడా అయన సతీమని 100 మీటర్ల ముందునుంచే నడుచుకొని వచ్చారు.అదే వైసీపీ ఎమ్మెల్సీ భార్య నామినేషన్ వేసేందుకు Ro కార్యాలయం వద్దకే వెళ్ళింది.
వైసీపీ వారికి మాత్రం పోలీసులు గేట్లు తెరిచి లోపలికి పంపించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.