కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్( Delhi CM Arvind Kejriwal ) తో పాటు ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వినిపించారు.

 Delhi High Court Reserves Verdict On Arvind Kejriwal Plea Challenging Ed Arrest,-TeluguStop.com

అలాగే కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి( Abhishek Manu Singhvi ) వాదనలు వినిపించారు.డిజిటల్ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది.

కేజ్రీవాల్ మనీలాండరింగ్ నేరానికి( Money Laundering Case ) సంబంధించిన సాక్షం ఒక్కటీ లేదని అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు.ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Case ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube