హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ముగిసింది.ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) ధర్నా కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 3 ను( GO No.3 ) ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai Sounder Rajan ) చొరవ తీసుకోవాలని కవిత కోరారు.ఈక్రమంలోనే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే సమస్యను వివరిస్తామని తెలిపారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.







