హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Case ) కేసులో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ మేరకు మీర్జా వాహిద్ బేగ్ ను విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పొందుపరిచారని తెలుస్తోంది.
నిందితులు స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కాగా ఈ నెల 29న గచ్చిబౌలిలో మీర్జా వహీద్( Mirza Wahid ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన నుంచి సుమారు 3.58 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ( Abbas Ali ) ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారని సమాచారం.ఫిబ్రవరి నెలలోనే పది సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు మీర్జా వహీద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి సినీ దర్శకుడు క్రిష్( Director Krish ) పేరును ప్రస్తావించారు.
కేసులో ఏ13 అబ్దుల్ రెహమాన్ తో ఏడాదిగా మీర్జా వాహిద్ కు పరిచయం ఉందని తెలుస్తోంది.రాడిసన్ హోటల్ లో పదికి పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు.