మామూలు రోజుల్లో ఎలా ఉన్నా.పండగలకు, పబ్బాలకు అందంగా మెరిసి పోవాలని అందరికీ ఉంటుంది.
ముఖ్యంగా మగువలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు.అయితే త్వరలోనే దసరా లేదా విజయ దశమి రాబోతోంది.
తెలుగు వారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండగల్లో దసరా ఒకటి.మరి ఈ పండక్కు మీరు అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలనుందా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ మీరు ట్రై చేయాల్సిందే.ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఓట్స్ పిండి, అర స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, సరిపడా గ్రీన్ టీను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని పది నుంచి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆపై చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.స్కిన్ టోన్ సైతం రెట్టింపు అవుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల మిల్క్ క్రీమ్, అర స్పూన్ కస్తూరి పసుపు మరియు ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం మెల్ల మెల్లగా రుద్దుకుంటూ వాటర్తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్గా చేస్తే మొటిమలు, మచ్చలు పోయి.ముఖం తాజాగా, అందంగా మెరిసిపోతుంది.
ఇక ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి, నాలుగు స్పూన్ల బీట్రూట్ జ్యూస్, ఒక స్పూన్ నిమ్మ రసం వేసుకుని బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.
పావు గంట పాటు వదిలేయాలి.ఆపై గోరు వెచ్చని నీటితో ఫేస్ వాస్ చేసుకోవాలి.
ఇలా డే బై డే చేయడం వల్ల స్కిన్ గ్లోగా, షైనీగా మారుతుంది.