మాజీ క్రికెటర్ గౌతం గంభీర్( Former Cricketer Gautam Gambhir ) రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా( BJP JP Nadda )ను గౌతం గంభీర్ కోరారని సమాచారం.
ఇంతకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( PM Modi,Amit Shah )కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అయితే ప్రస్తుతం గౌతం గంభీర్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఇకపై క్రికెట్( Cricket ) పై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారని, ఈ క్రమంలోనే రాజకీయాలకు దూరమవ్వాలని గౌతం గంభీర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.







