ఏపీ ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.25 ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని చెప్పారు.జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం పూరించారన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తుతామని తెలిపారు.