జనవరి 22న అయోధ్యలో కొత్త ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.హిందువులు చాలా ఏళ్లుగా అయోధ్యలోని రామ జన్మభూమి ప్రదేశంలో రాముడి కోసం ఆలయం కట్టాలని ఆశిస్తూ వస్తున్నారు.
ఇవాళ్టితో వారి కోరిక నెరవేరనుంది.దీని పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వారిలో ఒకరు గుజరాత్కు( Gujarat ) చెందిన సిద్ధార్థ్ దోషి( Siddharth doshi ).అతను విభిన్న థీమ్లతో జాగ్వార్ కారును( Jaguar car ) తరచుగా డెకరేట్ చేస్తుంటాడు.తాజాగా తన కారును ఆలయ వేడుకలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు.
అందుకు అతను తన కారుకు ఆరెంజ్ పెయింట్ చేశాడు, ఇది హిందువులకు పవిత్రమైన రంగు.
అతను తన కారుపై శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భక్తుడు హనుమంతుని చిత్రాలను కూడా ఉంచాడు.సిద్ధార్థ్ తన కారుపై రాముడి జీవితం గురించిన పురాతన ఇతిహాసమైన రామాయణంలోని కొన్ని శ్లోకాలను జోడించాడు.
తన కారు ముందు భాగంలో ఆలయ డిజైన్ చిత్రాన్ని కూడా ఉంచాడు.

గుజరాత్లోని సూరత్ నగరం నుంచి ఆలయం ఉన్న అయోధ్యకు తన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు.రాముడి పట్ల తనకున్న భక్తిని, ఆలయానికి తన మద్దతును తెలియజేయాలనుకున్నాడు.దారిలో తన కారును ఇష్టపడిన ప్రముఖ రాజకీయ నాయకులను కలిశాడు.
అతనితో రాజకీయ నాయకులు ఫోటోలు దిగి అతని సృజనాత్మకతను కొనియాడారు.ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సిద్ధార్థ్ తన కారు రూపాన్ని మార్చడం ఇదే మొదటిసారి కాదు.గత సంవత్సరం, అతను తన కారును G20 సమ్మిట్ లాగా మార్చేసాడు, ఆ సందర్భంగా జీ20 సదస్సులో భారత్కు నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి తాను వీరాభిమానినని తెలిపారు.అంతకు ముందు, అతను తన కారును బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 వ సంవత్సర వేడుకల వలె కారును చేంజ్ చేసి ఆశ్చర్యపరిచాడు.స్వాతంత్ర్య సమరయోధులను, భారతదేశం సాధించిన విజయాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఇలా చేశాడు.
తన కారుపై భారత జెండా రంగులు, స్వాతంత్య్ర ఉద్యమ చిహ్నాలను ఉపయోగించాడు.







