సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

 Chandrababu Fiber Net Case Trial In Supreme Court..!!-TeluguStop.com

అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ ను జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుంది.అయితే ఈ కేసు పిటిషన్ సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ వచ్చినప్పటికీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెక్షన్ 17ఏకు సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉండటంతో ఈ విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఇవాళ విచారణ ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా? రాదా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube