సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ ను జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుంది.

అయితే ఈ కేసు పిటిషన్ సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ వచ్చినప్పటికీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెక్షన్ 17ఏకు సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉండటంతో ఈ విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఇవాళ విచారణ ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా? రాదా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్.. ఒబామా మౌనం వెనుక..?