యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) వక్కంతం వంశీ కాంబోలో సినిమా అంటూ వార్తలు రావడం కొత్తేం కాదు.వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ సినిమాకు బదులుగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో నటించాల్సి ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు హోల్డ్ లో పడిందనే ప్రశ్నకు సరైన జవాబు చాలామందికి తెలియదు.అయితే వక్కంతం వంశీ ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు బదులివ్వడం గమనార్హం.
కథకు సంబంధించిన సమస్య వల్ల జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఆగిందని వక్కంతం వంశీ పేర్కొన్నారు.తయారు చేసిన కథను పూర్తిస్థాయి సినిమాగా చేద్దామనే కాన్ఫిడెన్స్ ఇద్దరికీ రాలేదని వక్కంతం వంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక్కో కథకు ఒక్కో సమస్య వచ్చి మరో సినిమా చేసుకొని వస్తానని బయటకు వచ్చేశానని వక్కంతం వంశీ కామెంట్లు చేయడం గమనార్హం.
నేను చిరంజీవికి( Chiranjeevi ) బిగ్గెస్ట్ ఫ్యాన్ అని పర్సనల్ ట్రావెలింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ అని వక్కంతం వంశీ వెల్లడించారు.ఎన్టీఆర్ తో సినిమా నేను చేయకపోవడంతో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నానని వక్కంతం వంశీ వెల్లడించారు.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అప్పుడు నచ్చిన వాళ్లు కూడా ఉన్నారని వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) పేర్కొన్నారు.
రేసుగుర్రం లాంటి ఎంటర్టైనర్ ను ప్రేక్షకులు ఆశించారని వక్కంతం వంశీ పేర్కొన్నారు.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథలో లోపాలు ఉండటం వల్ల సినిమా మెప్పించలేదని ఆయన అన్నారు.డైరెక్టర్ గా ఆ సినిమా నాకు మంచి పేరును తెప్పించిందని వక్కంతం వంశీ వెల్లడించడం గమనార్హం.
బన్నీ సింగిల్ సిట్టింగ్ లో ఈ సినిమాను ఓకే చేశారని వక్కంతం వంశీ పేర్కొన్నారు.