జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అస్వస్థతకు గురయ్యారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో విద్యాసాగర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన గుండెకు స్టంట్ వేశారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
అయితే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం కావడంతో విద్యాసాగర్ రావు తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది.ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా ఓడిపోవడం బాధ కలిగించదన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారని సమాచారం.