రేవంత్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని,సూర్యాపేట నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి మంత్రి జగదీష్ రెడ్డి పాలనను,కాంగ్రెస్ విధానాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేశానని,టిక్కెట్ ఇస్తామని, వెళ్ళి నియోజకవర్గంలో మీ పని చేసుకోండని చెప్పి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశారని పేట కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి శుక్రవారం కంటతడి పెట్టుకున్నారు.

 Patel Ramesh Reddy Shocking Comments On Revanth Reddy, Patel Ramesh Reddy , Reva-TeluguStop.com

జిల్లా కేంద్రంలోని తననివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏం జరిగిందో తెలియదని,దీని వెనుక ఎవరి హస్తముందో కానీ,మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడం కోసమే దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు.

సూర్యాపేట నియోజకవర్గ ప్రజల మద్దతు తనకే ఉందని, ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.దీనితో సూర్యాపేటలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube